Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడశిశువు పుట్టిందని.. ముళ్లపొదలో పారేశారు.. నాచారంలో?

ఆడశిశువు పుట్టిందని ఆ శిశువు తల్లితండ్రులు పసికందును ముళ్లపాలు చేశారు. ఈ ఘటన నాచారంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నాచారం ఓల్డ్‌విలేజ్‌-బాబానగర్‌ మార్గంలోని మసీదు సమీపంలో నిరుపయోగంగా ఉన్న

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (13:58 IST)
ఆడశిశువు పుట్టిందని ఆ శిశువు తల్లితండ్రులు పసికందును ముళ్లపాలు చేశారు. ఈ ఘటన నాచారంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నాచారం ఓల్డ్‌విలేజ్‌-బాబానగర్‌ మార్గంలోని మసీదు సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఇంటి వద్ద ముళ్ల చెట్లలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ శిశువును వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.
 
రంజాన్‌ మాసం కావడంతో ప్రార్థనల కోసం మసీదుకు వస్తున్న మహమ్మద్‌ అహ్మద్‌ అనే వ్యక్తి పాప ఏడుపు విని 100కి సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని.. 108 కి ఫోన్ చేసి ఆంబులెన్స్‌ను రప్పించారు. 
 
శరీరం నుంచి రక్తం కారుతున్న స్థితిలో పాపను 108 సిబ్బంది స్థానిక ఆసుపత్రికి, అనంతరం నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాప ఒంట్లో నుంచి రక్తం ఎక్కువగా పోవడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును ఎవరు వదిలి వెళ్లారో కనుగొనేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments