Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ నమోదుకు తొందరవద్దు.. ప్రభుత్వం

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (11:57 IST)
ఆధార్‌, కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురైనఘటనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఆధార్ అప్‌డేట్‌ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన, ఆదుర్దా పడాల్సిన అవసరంలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వాటిని అప్‌డేట్‌ చేయించుకోవచ్చని పేర్కొంది. ఎలాంటి గడువు లేదని పేర్కొంది. 
 
స్కూలు పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ తాజా వివరాల నమోదుకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దకు వెళ్ళనవసరం లేదని తెలిపింది. రానున్న రోజుల్లో స్కూలు పిల్లలు చదువుతున్న పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపిస్తుందని వెల్లడించింది. అక్కడే ఆధార్ వివరాలు అప్‌డేట్‌ చేయించుకోవచ్చని వెల్లడించింది. ఈ-కేవైసీ అప్‌డేట్‌ చేయనంత మాత్రాన రేషన్ సరుకులను తిరస్కరించడం అంటూ ఉండదని స్పష్టం చేసింది. 
 
ఎక్కడైతే రేషన్‌ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే ఈ-కేవైసి చేసుకోవచ్చని తెలిపింది. ఈ-కేవైసి కొరకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్ళ కూడదని వెల్లడించింది. ఇదివరకు రేషన్ దుకాణం వద్ద కేవైసి చేయించుకొని ఉంటే మరల చేయించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. 
 
ప్రజలు ఆందోళనకు గురికావొద్దని, ఆధార్ కేంద్రాలు వద్ద, మీ సేవ కేంద్రాల వద్ద, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడొద్దని విజ్ఞప్తి. అధికారులు, వాలంటీర్లు, ఉద్యోగులు, మీడియా సంస్థలు ఈ అంశాన్ని ప్రజలకు వివరించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments