Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడు ఫోన్‌లో మాట్లాడటం లేదని యువతి ఆత్మహత్య

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (11:21 IST)
తన స్నేహితుడు తనతో మాట్లాడటం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రం ఇందిరమ్మ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీలో కాపురమున్న అంజనా దేవి కుమార్తె రంజిత(18) విజయవాడలో నీట్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటోంది. 
 
కరోన వైరస్ ప్రభావంతో యువతి కొన్ని రోజుల క్రితం ఇంటికి చేరింది. ఈ క్రమంలో సహచర విద్యార్థితో ఫోన్లో తరచూ సంభాషించేది. గత 3 రోజులుగా సహచర విద్యార్థి ఫోన్లో సంభాషించకుండా ఆపివేయడంతో మనస్థాపానికి గురై ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
తల్లి అంజనాదేవి ఏఎన్ఎం విధులు ముగించుకుని ఇంటికి రాగానే తన కుమార్తె ఫ్యానుకు వేలాడుతూ కనపడటంతో కేకలు వేసింది. ఈ సంఘటనపై కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ ఐ.రవి ప్రకాష్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కగానొక్క కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి కన్నీటిపర్యంతమై విలపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments