Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడు ఫోన్‌లో మాట్లాడటం లేదని యువతి ఆత్మహత్య

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (11:21 IST)
తన స్నేహితుడు తనతో మాట్లాడటం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రం ఇందిరమ్మ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీలో కాపురమున్న అంజనా దేవి కుమార్తె రంజిత(18) విజయవాడలో నీట్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటోంది. 
 
కరోన వైరస్ ప్రభావంతో యువతి కొన్ని రోజుల క్రితం ఇంటికి చేరింది. ఈ క్రమంలో సహచర విద్యార్థితో ఫోన్లో తరచూ సంభాషించేది. గత 3 రోజులుగా సహచర విద్యార్థి ఫోన్లో సంభాషించకుండా ఆపివేయడంతో మనస్థాపానికి గురై ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
తల్లి అంజనాదేవి ఏఎన్ఎం విధులు ముగించుకుని ఇంటికి రాగానే తన కుమార్తె ఫ్యానుకు వేలాడుతూ కనపడటంతో కేకలు వేసింది. ఈ సంఘటనపై కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ ఐ.రవి ప్రకాష్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కగానొక్క కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి కన్నీటిపర్యంతమై విలపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

తర్వాతి కథనం
Show comments