Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో భర్త శవం ఉన్నా... బాధను దిగమింగుకుని వెళ్లి ఓటు వేసిన భార్య

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (08:56 IST)
ప్రజాస్వామ్య దేశంలో పలువురు ఓటు హక్కును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఓటు వేసి తీరుతారు. అందరికీ స్ఫూర్తిదాకయంగా నిలుస్తారు. అలా ఓ మహిళ నిలిచారు. అనారోగ్యంతో చనిపోయిన భర్త శవాన్ని ఇంట్లో ఉన్నప్పటికీ బాధ్యత మరవకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లా కారంచేడులో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన గర్నెపూడి చిట్టెమ్మ భర్త సింగయ్య (62) పోలింగ్ రోజైన మే 13 సోమవారం తేదీన అనారోగ్యంతో చనిపోయాడు. 
 
అయినప్పటికీ భర్త శవం ఇంట్లో ఉన్నప్పటికీ ఆమె పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. 178 పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తద్వారా ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న విలువను ఇతరులకు చాటిచెప్పారు. కాగా, గ్రామంలో చిట్టెమ్మ వీఏవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఓటుపై అవగాహన ఉన్న ఆమె ఎంతో బాధలోనూ ఓటు వేయడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. దీంతో గ్రామస్థులంతా ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments