Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (18:00 IST)
వ్యసనాలకు బానిసై మద్యం మత్తులో ఉన్న కుమారుడు నీళ్ల సీసాలో పురుగుల మందు కలుపుకొని తాగి చనిపోయాడు. ఆ విషాద వార్త విన్న తల్లి.. దాహం వేస్తుండటంతో వెనుకాముందూ చూసుకోకుండా అదే సీసాలోని నీళ్లను తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ములుగు మండలం పాల్‌సాబ్‌పల్లి గ్రామంలో జరిగింది. 
 
కాసర్ల రాజమల్లు.. కొమురమ్మ దంపతుల కుమారుడు రాజు మద్యం మత్తులో పురుగుల మందును కలుపుకుని తాగేశాడు. తండ్రి గమనించి ములుగు ఏరియా వైద్యశాలకు తరలించాడు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.
 
కూలీకి వెళ్లి  సాయంత్రం తిరిగొచ్చిన కొమురమ్మకు ఇరుగుపొరుగు విషయం చెప్పడంతో లబోదిబోమంటూ ఇంట్లోకి వెళ్లింది. ఆ పక్కనే ఉన్న సీసాలోని నీటిని తాగింది. తర్వాత వాసన వస్తుండటంతో పక్కనున్నవారికి చెప్పింది. ములుగు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆమె మృతి చెందింది. గంటల వ్యవధిలో తల్లీకొడుకు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments