Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (18:00 IST)
వ్యసనాలకు బానిసై మద్యం మత్తులో ఉన్న కుమారుడు నీళ్ల సీసాలో పురుగుల మందు కలుపుకొని తాగి చనిపోయాడు. ఆ విషాద వార్త విన్న తల్లి.. దాహం వేస్తుండటంతో వెనుకాముందూ చూసుకోకుండా అదే సీసాలోని నీళ్లను తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ములుగు మండలం పాల్‌సాబ్‌పల్లి గ్రామంలో జరిగింది. 
 
కాసర్ల రాజమల్లు.. కొమురమ్మ దంపతుల కుమారుడు రాజు మద్యం మత్తులో పురుగుల మందును కలుపుకుని తాగేశాడు. తండ్రి గమనించి ములుగు ఏరియా వైద్యశాలకు తరలించాడు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.
 
కూలీకి వెళ్లి  సాయంత్రం తిరిగొచ్చిన కొమురమ్మకు ఇరుగుపొరుగు విషయం చెప్పడంతో లబోదిబోమంటూ ఇంట్లోకి వెళ్లింది. ఆ పక్కనే ఉన్న సీసాలోని నీటిని తాగింది. తర్వాత వాసన వస్తుండటంతో పక్కనున్నవారికి చెప్పింది. ములుగు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆమె మృతి చెందింది. గంటల వ్యవధిలో తల్లీకొడుకు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments