Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి... త్రివర్ణ పతాకంలోని రంగులు దేనికి ప్రతీక!

ప్రతి భారతీయుడూ ఆదరించి, అభిమానించే మూడు రంగుల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (11:34 IST)
ప్రతి భారతీయుడూ ఆదరించి, అభిమానించే మూడు రంగుల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని పింగళి వెంకయ్య ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. భారత జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. సత్యం, అహింసలను ఆచరించటం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుందని విశ్వసించిన మహనీయుడు ఆయన అని చంద్రబాబు అన్నారు.
 
పింగళి వెంకయ్య భారత స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. విభిన్న ఆందోళనలలో భాగస్వామ్యుడై, నిస్వార్ధ సేవానురక్తుడై, దేశ స్వతంత్రానుక్తుడై, నిబద్ధతతో జీవనం సాగించి, మంచి ఉపన్యాసకుడిగా, వ్యవసాయ క్షేత్రాభివృద్ధికి తోడ్పడిన వ్యక్తిగా జన బాహుల్యానికి పరిచయమైన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయారు. 
 
శ్రీపింగళి 1876, ఆగస్టు 2న కృష్టా జిల్లా దివి తాలూకలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. 1921 మార్చి 31వ తేదీన విజయవాడలో జరిగిన భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జెండాను రూపొందించి అందించారు. ఈ త్రివర్ణ పతాకంలో ఉండే మూడు గుర్తులు... కేసరి (కాషాయం) - ధైర్య, సాహసాలకు ప్రతీక, తెలుపు - శాంతి, సత్యాలకు, ఆకుపచ్చ - విశ్వాస, సౌభ్రాతృత్వానికి ప్రతీకలు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments