Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకుతో సెల్ఫీ తీసుకుంటూ వరద నీటిలో కొట్టుకుపోయిన తల్లి

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (20:03 IST)
మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు చిత్తూరు జిల్లాలో పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. కొడుకుతో పాటు ఫోటోలు తీసుకుందామని చిత్తూరు జిల్లాలో ఓ తల్లి వాగు వద్దకు వచ్చింది. ఫోటో తీసుకుంటుండగా ఒక్కసారిగా వరదనీరు ఉధృతి పెరిగింది. దీంతో ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయారు. 
 
చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జల్లిపేట చెక్ డ్యాం వద్ద నీటిప్రవాహం ఎక్కువగా ఉందని గడ్డూరు కాలనీకి చెందిన మౌలా భార్య పర్వీన్ తెలుసుకుంది. గ్రామస్తులందరూ వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారని కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళింది.
 
వాగులో దిగి ఎనిమిదేళ్ళ కొడుకు హమీద్‌తో కలిసి ఫోటోలు తీసుకుంటూ ఉంది. అయితే ఉన్నట్లుండి వరద ఉధృతి పెరగడంతో కొడుకుతో పాటు ఆమె వరద నీటిలో కొట్టుకుపోయింది. సుమారు మూడుగంటల పాటు రెస్య్కూ టీం గాలించి తల్లి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇంకా కుమారుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments