Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి చేసుకుని ప్రియుడితో డేటింగ్.. ఆ తర్వాత? (Video)

కని పెంచిన పేగు బంధాన్ని కాదనుకుంది. మూణ్ణాళ్ల పరిచయాన్ని గొప్పగా భావించి ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. అలాగని పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారా... అదీ లేదు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (19:19 IST)
కని పెంచిన పేగు బంధాన్ని కాదనుకుంది. మూణ్ణాళ్ల పరిచయాన్ని గొప్పగా భావించి ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. అలాగని పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారా... అదీ లేదు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి ఒకటిన్నర సంవత్సరంగా సహజీవనం చేస్తున్నారు.  
 
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పోటు కనుమ గ్రామానికి చెందిన స్వాతికి అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడికి ఇచ్చి మూడు సంవత్సరాల ముందు వివాహం చేశారు. తిరుపతిలోని జీవకోనలో భార్యాభర్తలు కాపురం పెట్టారు. ఒకటిన్నర సంవత్సరం పాటు బాగానే వున్నా ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో విడిపోవాలనుకున్నారు భార్యాభర్తలు. ఇంతలో స్వాతికి తనతో షాపులో పనిచేసే ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు చెప్పకుండానే ఇంటి నుంచి వచ్చేసిన స్వాతి ప్రియుడితో కలిసి ఒకటిన్నర సంవత్సరంగా సహజీవనం చేస్తోంది.
 
రాజేష్ బంధువులు స్వాతి కోసం వెతికినా  ఫలితం లేకుండా పోయింది. శనివారం ఉదయం స్వాతి స్కూటర్ పైన వెళుతుండగా రాజేష్ బంధువు ఒకరు చూసి వెంబడించారు. రైల్వే కాలనీలోని ఒక గదిలో ప్రియుడితో కలిసి స్వాతి ఉన్న విషయాన్ని తెలుసుకుని రాజేష్ బంధువులందరూ అక్కడకు చేరుకున్నారు. స్వాతిని చితకబాదారు. అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా సరే స్వాతి మాత్రం తన ప్రియుడితోనే కలిసి ఉంటానని చెబుతోంది. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments