Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు ముడుపులు అందాయి.. ఆధారాలున్నాయ్: జైరామ్ రమేష్(వీడియో)

పోలవరం ప్రాజెక్టు పనులు నిధుల్లేక ముందుకు సాగట్లేదని.. కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిధులను విడుదల చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్న నేపథ్యంలో.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమే

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (17:45 IST)
పోలవరం ప్రాజెక్టు పనులు నిధుల్లేక ముందుకు సాగట్లేదని.. కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిధులను విడుదల చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్న నేపథ్యంలో.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం విషయంలో చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని జైరామ్ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం విదేశాల్లో ఆయన ముడుపులు అందాయని జైరామ్ రమేష్ తెలిపారు. 
 
నాలుగేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కేవలం పునాది రాళ్లకే పరిమితమైందని జైరామ్ రమేష్ ఎద్దేవా చేశారు. విభజన హామీలకు సంబంధించి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాటకాలాడుతున్నారని జైరామ్ రమేష్ ఆరోపించారు.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. ఏపీ విభజన శాస్త్రీయంగా జరుగలేదని చెప్తున్న బీజేపీ.. పార్లమెంట్‌తో పూర్తి మెజారిటీ కలిగి వున్నందున చట్టంలో మార్పు చేయవచ్చు కదా అంటూ జైరామ్ రమేష్ నిలదీశారు. వీడియో చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments