Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్ను ఎస్సై పిలుస్తున్నాడంటూ తీసుకెళ్లి యువతిపై అత్యాచారం

Webdunia
శనివారం, 29 మే 2021 (11:49 IST)
ఒంగోలులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఎస్సై పిలుస్తున్నాడని చెప్పి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
వివరాలు ఇలా వున్నాయి. ఒంగోలు కొత్తమామిడి పల్లికి సమీపంలో ఓ యువతి తన స్నేహితుడితో కలిసి బయటకు వచ్చింది. ఆ తర్వాత సాయంత్రం అక్కడి నుంచి ఒంటరిగా ఇంటికి వెళుతుండగా ఆమెను అనుసరిస్తూ వచ్చిన ఓ కామాంధుడు ఆమెని అడ్డగించి, నీ స్నేహితుడితో నువ్వు క్లోజ్‌గా వున్న ఫోటోలు నా దగ్గర వున్నాయనీ, వాటిని నీ తల్లిదండ్రులకు చూపుతానంటూ బెదిరించాడు.
 
అందుకు ఆ యువతి నేనేమీ తప్పు చేయలేదంటూ ధైర్యంగా సమాధానం చెప్పేసరికి ప్లేటు ఫిరాయించాడు. వెంటనే నిన్ను ఎస్సైగారు తీసుకుని రమ్మన్నారంటూ బెదిరించి తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకున్నాడు. ఆమెను ఊరు బయట శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఆ తర్వాత ఆమెను మళ్లీ తిరిగి తీసుకుని వచ్చి ఆమె వుంటున్న ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని తన స్నేహితురాళ్లతో యువతి చెప్పడంతో వారు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments