Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో కోడలిని చంపేసిన మామ

Webdunia
మంగళవారం, 3 మే 2016 (16:23 IST)
పుట్టింటి తరువాత ఆడబిడ్డకు మెట్టిల్లే ఆలయమంటారు పెద్దలు. మెట్టినింటిలోని అత్త, మామలే కన్నతల్లిదండ్రులతో సమానమంటారు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం సమాజంలో కొన్ని సంఘనలు జరుగుతున్నాయి. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన కోడలిని దారుణంగా కొట్టి చంపాడో మామ. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
 
పుంగనూరు భగత్‌సింగ్‌ కాలనీలో భాగ్యమ్మ, రాజశేఖర్‌లు నివాసముంటున్నారు. వీరితో పాటు రాజశేఖర్‌ మామ హరి కూడా ఉంటున్నారు. ఇంట్లో తరచూ మామ హరి కోడలికి పనిచెప్పేవారు. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతుండేవి. మంగళవారం కూడా టిఫిన్‌ విషయంలో కోడలు, మామకు మధ్యకు గొడవ జరగడంతో ఆమె తీవ్రంగా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. 
 
అంతటితో ఆగకుండా ఆమెను ఇంటిలోనే ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులను నమ్మబలికే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు మాత్రం మామే కోడలిని చంపేశాడని ఫిర్యాదు చేశారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments