Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్ దొంగిలించాడని కరెంట్ షాక్ ఇచ్చి, అగ్గిపుల్లలతో బాలుడిని కాల్చి చంపారు

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (21:06 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. 13 సంవత్సరాల భరత్ అనే బాలుడు సెల్ ఫోన్‌ను దొంగిలించి విక్రయించేశాడు. దీంతో కోపంతో ఆ బాలుడికి విద్యుత్ షాక్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. విద్యుత్ షాక్‌కు తేరుకుని పైకి లేస్తున్న బాలుడిని అగ్గిపుల్లలతో శరీరంపై కాల్చారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాలుడు మృతి చెందాడు.
 
మదనపల్లె యాదవ వీధిలో నివాసముండే బన్నీ తన పెద్దనాన్న సెల్ ఫోన్‌ను దొంగిలించి తను అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ చాంద్ బాషాకు సెల్ ఫోన్‌ను విక్రయించాడు. విషయం కాస్త పెద్దనాన్నకు తెలిసింది. దీంతో భరత్‌ను ఇంటి మిద్దెపైకి తీసుకెళ్ళి ఖాళీగా ఉన్న గదిలో కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చారు.
 
భరత్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మధ్యాహ్నం తేరుకున్నాడు. మళ్ళీ అతడిని అగ్గిపుల్లలతో శరీరంపై కాల్చారు. దీంతో భరత్ స్పృహ తప్పి పడిపోయాడు. భరత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే చనిపోయాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆడుతూపాడుతూ ఉన్న బాలుడు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments