Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకున్నాడు... రూ.45 లక్షలు తీస్కుని జంప్

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (10:40 IST)
ఫేస్ బుక్‌లో ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. చివరకు సహజీవనం వరకు వెళ్ళింది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగన్నరేళ్ళు ప్రియుడితో కలిసి సహజీవనం చేసింది. ప్రియుడిని నమ్మి 45 లక్షలు రూపాయలు ఇచ్చింది. ఇంకేముంది పెళ్ళి మాట వచ్చేసరికి ముఖం చాటేశాడు. కనిపించకుండా పారిపోయాడు. దీంతో లబోదిబోమంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
 
ప్రకాశం జిల్లాకు చెందిన అరవింద్ కు నల్గొండజిల్లా నల్గొండ నగరానికి చెందిన సహస్రకు మధ్య ఫేస్ బుక్ ద్వారా నాలుగున్నరేళ్ళ క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ప్రేమిస్తున్న యువకుడు పెళ్ళి చేసుకుంటాడన్న నమ్మకంతో సర్వస్యం అప్పజెప్పింది. 
 
నాలుగున్నరేళ్ళు ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. అంతేకాదు ప్రియుడిని నమ్మి తన ఆస్తి అమ్మి 45 లక్షల రూపాయలు కూడా ఇచ్చింది. తన తల్లి అనారోగ్యంతో ఉన్నా పట్టించుకోకుండా ప్రియుడు అరవిందే సర్వస్వం అని భావించింది సహస్ర.
 
చివరకు పెళ్ళి చేసుకుంటాడని నమ్మింది. కానీ అరవింద్ మాత్రం పెళ్ళి చేసుకోనని ముఖం మీద చెప్పేశాడు. దీంతో టంగుటూరు పోలీసులను ఆశ్రయించింది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. రాజకీయ ఒత్తిళ్ళలో అరవింద్ పై కేసు నమోదు చేయలేదు. అరవింద్ ఇంటి ముందు బైఠాయించింది. అరవింద్ ఇంటికి తాళాలు వేసి ఎక్కడికో పారిపోయాడు. దీంతో సహస్ర లబోదిబోమంటూ మీడియాను ఆశ్రయించింది. న్యాయం జరుగకుంటే ఆత్మహత్యే శరణ్యమంటోంది సహస్ర.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments