Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని భార్యను గెంటేసి పరారైన భర్త-అత్త

Webdunia
బుధవారం, 8 మే 2019 (18:58 IST)
ఆధునిక సమాజంలోను కొడుకు, కూతురు తేడా చూపిస్తున్నారు కొందరు. కుమారుడైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కుమార్తె అయితే డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అనుకుంటున్నారు కొంతమంది. అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఉదంతం బయటపడింది. కర్నూలు జిల్లా స్వామిరెడ్డినగర్‌కు చెందిన అబ్ధుల్ మాజిత్ అనే వ్యక్తి తన భార్యకు ఆడపిల్లలే పుడుతున్నారనే కోపంతో భార్యను ఇంటి నుంచి బయటకు తరిమేశాడు.
 
అబ్ధుల్ మాజిత్, గౌసియాలకు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. మొదటి సంతానం ఆడపిల్ల. రెండవ సంతానం కూడా ఆడపిల్లే. దీంతో గత 7 నెలల నుంచి భార్య గౌసియాను అబ్ధుల్ మాజిత్, అత్త నిలోఫర్‌లు వేధిస్తూ వచ్చారు. అత్తతో పాటు భర్త పెట్టిన బాధలను తట్టుకుంది గౌసియా. అయితే గత రెండురోజుల ముందు ఇద్దరూ చిత్రహింసలకు గురిచేసి గౌసియాను ఇంటి నుంచి పిల్లలతో సహా బయటకు గెంటేశారు. 
 
ఆ తరువాత ఇంటికి తాళాలు వేసి ఇద్దరూ కనబడకుండా ఎటో వెళ్లిపోయారు. దీంతో గౌసియా తనకు న్యాయం కావాలంటూ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అబ్ధుల్ మాజిత్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో పాటు బంధువుల ఇళ్ళలో ఎక్కడా లేకపోవడంతో పోలీసులు అతనితో పాటు నిలోఫర్ కోసం వెతుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments