Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఓబీలో మళ్లీ కాల్పుల మోత

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (05:44 IST)
ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మరోసారి తుపాకీ చప్పుడైంది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు మావోలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి.

విశాఖ జిల్లా గూడెంకొత్త వీధి మండలం గుమ్మిరేవుల వద్ద మరోసారి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అటవీప్రాంతంలో దాదాపు 20 నిమిషాలపాటు తుపాకుల శబ్దాలు వినిపించాయి. నిన్నటి ఎదురుకాల్పుల్లో ముగ్గురు మవోలు మృతి చెందారు. మరి కొందరు అడవిలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసు బలగాలకు.. మావోయిస్టులు తారసపడిన సందర్భంలో.. మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మరికొంతమంది మావోయిస్టులు గాయపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కొన్ని ఆయుధాలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిన్న మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు అటవీ ప్రాంతం నుంచి రహదారి మార్గానికి తీసుకువచ్చారు. వారిని చత్తీస్​గఢ్​కు చెందిన అజయ్, బుద్రి, బిమ లుగా గుర్తించారు. ఈ మృతదేహాలకు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments