Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి...

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (10:38 IST)
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను చిత్రీకరించి లైంగింక దాడికి పాల్పడ్డారు నలుగురు యువకులు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
వివరాలు పరిశీలిస్తే పనపాకం గ్రామానికి చెందిన సరిత ( పేరు మార్చాం) చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో సరిత సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. స్కూల్‌కి సెలవులు కావడంతో పనపాకంలో నాయనమ్మ ఇంటికి వచ్చింది. సరిత స్నానం చేస్తుండగా మోహన్ అనే మైనర్ బాలుడు తన సెల్‌ఫోన్‌తో  వీడియో తీసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
అంతేకాదు మోహన్ తన నలుగురు స్నేహితులకు ఆమె ఫోటోలను షేర్ చేశాడు. వీటిని చూసిన ఆ యువకులు ఈ బాలికను లైంగికంగా వేధించారు. తమకు సహరించకపోతే ఫేస్ బుక్‌లో పెడతామని బెదిరించారు. వారి వేధింపులు తాళలేక ఆమె ఉరి వేసుకొని చనిపోవాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇరుగుపొరుగువారు గమనించి సరైన సమయంలో ఆమెను కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. కాగా ఈ దారుణానికి ఒడిగట్టిన ఐదుగురు యువకులను అరెస్టు చేసిన ఖాకీలు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం