Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి...

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (10:38 IST)
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను చిత్రీకరించి లైంగింక దాడికి పాల్పడ్డారు నలుగురు యువకులు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
వివరాలు పరిశీలిస్తే పనపాకం గ్రామానికి చెందిన సరిత ( పేరు మార్చాం) చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో సరిత సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. స్కూల్‌కి సెలవులు కావడంతో పనపాకంలో నాయనమ్మ ఇంటికి వచ్చింది. సరిత స్నానం చేస్తుండగా మోహన్ అనే మైనర్ బాలుడు తన సెల్‌ఫోన్‌తో  వీడియో తీసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
అంతేకాదు మోహన్ తన నలుగురు స్నేహితులకు ఆమె ఫోటోలను షేర్ చేశాడు. వీటిని చూసిన ఆ యువకులు ఈ బాలికను లైంగికంగా వేధించారు. తమకు సహరించకపోతే ఫేస్ బుక్‌లో పెడతామని బెదిరించారు. వారి వేధింపులు తాళలేక ఆమె ఉరి వేసుకొని చనిపోవాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇరుగుపొరుగువారు గమనించి సరైన సమయంలో ఆమెను కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. కాగా ఈ దారుణానికి ఒడిగట్టిన ఐదుగురు యువకులను అరెస్టు చేసిన ఖాకీలు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం