Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకిరీగాళ్లా.. లా కాలేజీ విద్యార్థులా.. ఏడేళ్ల చిన్నారిపై కత్తితో..?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (11:52 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలో ఏడేళ్ల చిన్నారిపై దారుణం చోటుచేసుకుంది. చెన్నైలో ఏడేళ్ల చిన్నారిని ఇద్దరు లా కాలేజీ విద్యార్థులు కత్తితో నరికారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, తండయార్ పేటకు చెందిన కార్తీక్‌కు ఓ కుమారుడు, ఓ కుమార్తె వుంది. 
 
కార్తీక్ ఏడేళ్ల కుమారుడు చంద్రు తన మేనమామతో రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. ఆ సమయంలో అతని వెనుక నుంచి ఇద్దరు యువకులు చేతిలో కత్తిని పెట్టుకుని తిప్పుతూ వచ్చారు. ఆ సమయంలో ఏదో శబ్ధం వినిపిస్తుందని చంద్రు తిరిగి చూశాడు. అంతే ఆ కత్తి చంద్రుపై పడింది. కత్తిని తిప్పుతూ వేగంగా బైకుపై రావడంతో బాలుడు భుజానికి, కంటికి గాయం ఏర్పడింది. 
 
దీంతో తీవ్ర రక్తస్రావంతో బాలుడిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ లా కాలేదీ విద్యార్థులని.. తాగి పోకిరీగాళ్లుగా బండ్లపై తిరుగుతూ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments