Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయాలు.. నలుగురు మంత్రులపై వేటు

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (11:25 IST)
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీలో అంతర్గత పోరు ఆకాశానికి తాకింది. ఫలితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయరాజే సింథియా సిఫార్సుల మేరకు పార్టీ హైకమాండ్ నలుగురు మంత్రులపై వేటు వేసింది. 
 
ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలు పార్టీని వీడగా, మరికొందరు తిరుగుబాటు గళమెత్తారు. అలా తిరుగుబాటు చేసిన నేతలపై భాజపా క్రమశిక్షణా చర్యలకు సిద్ధమైంది. 11 మంది రెబల్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. వీరిలో నలుగురు మంత్రులు కూడా ఉండటం గమనార్హం.
 
వీరంతా తమ నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకోకపోవడంతో భాజపా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 11 మంది సీనియర్‌ నేతలను ఆరు సంవత్సరాల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు గురువారం భాజపా ఓ ప్రకటన విడుదల చేసింది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ వీరికి టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో అసంతృప్తి చెందిన వీరు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు.
 
ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే భాజపాకు ఈ రెబల్స్‌ సమస్య మొదలైంది. ఇప్పటికే కొందరు సిట్టింట్‌ ఎమ్మెల్యేలు టికెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. కాగా, రాష్ట్రంలో డిసెంబరు 7న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ కాంబోలో మెగా చిత్రం... టైటిల్ చెప్పిన దర్శకేంద్రుడు - ఆ పేరు ఇదే...

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments