Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామీలలో 90 శాతం అమలు: మంత్రి అనిల్

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:50 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం కావాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
 
విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో వనమహోత్సవం  భాగంగా గవర్నర్‌పేట్‌లోని బుధవారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఆయా కాలనిలలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని సీఎం ఈ రోజు స్వీకారం చేశారన్నారు. సీఎం స్పూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని కోరారు. 
 
ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ  ఎమ్మెల్యే పి. రామ కృష్ణారెడ్డి, అధికారులు  సి నారాయణ రెడ్డి, ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇరిగేషన్), కె.నరసింహమూర్తి, ఇరిగేషన్  సూపరింటెండింగ్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్ విజయవాడ, పిపిఎంయు, సూపరింటెండింగ్ ఇంజనీర్,  ఎ.రాజా స్వరూప్ కుమార్, కెసి డివిజన్, విజెఎ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,  ఎ రాజా స్వరూప్ కుమార్  తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments