Webdunia - Bharat's app for daily news and videos

Install App

53 అడుగులకు చేరుకున్న గోదావరి తల్లి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

వరుణ్
ఆదివారం, 28 జులై 2024 (16:10 IST)
Godavari
భద్రాచలం వద్ద గోదావరి నది 53 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఇవ్వడం జరిగింది. శనివారానికే గోదావరి నది 53 అడుగుల వరద నీటిని కలిగివుంది. ముందుజాగ్రత్త చర్యగా ఇప్పటి వరకు 8 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. 
 
26 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీటిమట్టం పెరగడంతో  నీట మునిగిన గ్రామాల సంఖ్య పెరుగుతుందని అంచనా. వరద బాధిత కుటుంబాలకు బియ్యం, నూనె, కూరగాయలతో సహా సహాయక సామగ్రిని అందించారు. 
 
తాగునీరు సహా ఇతర నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు బోరు బావులను తవ్వారు. 23 ఆర్‌ఓ ప్లాంట్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కూడా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
 
రిలీఫ్ సిబ్బంది దాదాపు 1.2 లక్షల వాటర్ ప్యాకెట్లు, 30,000 క్లోరిన్ మాత్రలు పంపిణీ చేశారు. ప్రజలకు చికిత్స అందించేందుకు 23 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు దినేష్‌కుమార్‌ తెలిపారు. వైద్యులు పడవల్లో ప్రతి ఆవాసాన్ని సందర్శించి ప్రజల ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. 
 
నీటిమట్టం పెరగడం, మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నందున వరద ప్రభావిత ప్రాంతాల్లో వీఐపీలు వెళ్లకుండా చూడాలని పోలీసులు సూచించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments