Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

సెల్వి
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (07:24 IST)
Simhachalam
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పన్న స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురికి గాయాలైనాయి. మృతులలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు వున్నారు. 
 
మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురవడంతో సింహగిరి బస్తాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలిపోయింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారిక సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. 
 
అక్షయ తృతీయ రోజున వరాహా లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్న వేళ ఇలాంటి అపశ్రుతి చోటుచేసుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయ నిర్వాకం భక్తుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు. స్వామిపై వున్న చందనాన్ని వెండి బొరిగెలతో సున్నితంగా తొలగించి.. అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి భక్తులను అనుమతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments