అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

సెల్వి
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (07:24 IST)
Simhachalam
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పన్న స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురికి గాయాలైనాయి. మృతులలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు వున్నారు. 
 
మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురవడంతో సింహగిరి బస్తాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలిపోయింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారిక సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. 
 
అక్షయ తృతీయ రోజున వరాహా లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్న వేళ ఇలాంటి అపశ్రుతి చోటుచేసుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయ నిర్వాకం భక్తుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు. స్వామిపై వున్న చందనాన్ని వెండి బొరిగెలతో సున్నితంగా తొలగించి.. అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి భక్తులను అనుమతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments