Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రాజధాని ఉద్యమానికి 600 రోజు

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (10:25 IST)
అమరావతి రాజధాని ఉద్యమానికి 600వ రోజుకు చేరుకుంది. ఉద్యమ కార్యాచరణను అమరావతి జేఏసీ రాజధానిని ప్రకటించింది. ఆదివారం ఉదయం 9 గంటలకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో బైక్ ర్యాలీ జరగనుంది. 
 
హైకోర్టు దగ్గర ఉన్న జడ్జి క్వార్టర్ల నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీ జరగనుంది. మార్గమధ్యలో చర్చి, మసీదులను సైతం రైతులు సందర్శించనున్నారు. 
 
మరోవైపు, అమరావతి పోరాటం 600 రోజులైనా ఆగలేదని, రైతులు, మహిళల పోరాటస్ఫూర్తి తెలుగు జాతి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 
 
అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో కట్టిన సచివాలయం, శాసనసభల్లోనే ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ పెద్దలంతా కూర్చుని పనిచేస్తున్నారని, అదే భూముల్లో కట్టిన హైకోర్టు చుట్టూ రోజూ తిరుగుతూ ఆ రైతుల మొ హం చూడటానికి మాత్రం ఇష్టపడటం లేదని విమర్శించారు.
 
రైతుల పోరాటాన్ని అణచివేయడానికి, అమరావతి రాజధానిని నాశనం చేయడానికి వైసీపీ ప్రభుత్వం అనేక దారుణాలకు పాల్పడిందంటూ వివరించారు. చివరకు రాజధానిలో నిర్మించిన రోడ్లను కూడా తమ పార్టీ వారితో తవ్వించి కంకర, ఇసుక అమ్ముకొనే దుస్థితికి ప్రభుత్వ పెద్దలు దిగజారారన్నారు. 
 
అమరావతి నాశనం వల్ల ఎక్కువ నష్టపోయింది దళితులేనని తెలిపారు. అమాయక మొహం పెట్టుకొని తిరిగే జగన్‌రెడ్డి లోపల పెద్ద శా డిస్టు ఉన్నారని, ఆయన క్రూరత్వం అమరావతి నాశనంలో కనిపిస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments