Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ ఆశ చూపి... ఆరేళ్ల చిన్నారిపై అరవైయేళ్ళ వృద్ధుడు అత్యాచారం

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (13:43 IST)
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ళ చిన్నారిపై అరవైరెండేళ్ళ వృద్ధ కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
62 ఏళ్ల వృద్ధుడు.. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాతయ్యలాంటోడని నమ్మితే.. ఏ పాపం తెలియని చిట్టితల్లిపై మృగంలా రెచ్చిపోయాడు. ఇదేంటని నిలదీస్తే, డబ్బులిస్తా... గొడవ చేయొద్దు అంటూ తన పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘోరం శ్రీకాకుళం జిల్లా, మందస మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
 
మందస మండలానకి చెందిన గొరకల రుషి అనే 62 యేళ్ల వృద్ధుడు.. తన ఇంటి పక్కనే ఆడుకునే ఆరేళ్ళ చిన్నారిని చాక్లెట్ ఆశ చూపించాడు. దీంతో ఆ చిన్నారి తాతయ్యా అంటూ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఆ చిన్నారి అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు అసలు విషయాన్ని వెల్లడించారు. 
 
దీంతో తమ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, పంచాయతీ పెద్దల ముందు రుషి చేసిన తప్పును అంగీకరించాడు. పైగా, తాను చేసిన దారుణానికి పరిహారంగా సెటిల్మెంట్ చేసుకుందాన్న ప్రతిపాదన తెచ్చారు. దీనికి ససేమిరా అన్న పోలీసులు.. సోంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి, కామాంధుడిని అరెస్టు చేశారు. అత్యాచానికి గురైన బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments