Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు: ఐదుగురు సజీవ దహనం.. రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (13:07 IST)
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ముగ్గురు మాత్రం ఆటోలో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.  
 
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి దగ్గర విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 
 
ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని.. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పారిస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలను సీఎంవో అధికారులు తెలియజేశారు.
 
మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణం నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను ఆదేశించినట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు అన్నారు. 
 
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎస్ఈని ఆదేశించామన్నారు. హై టెన్షన్ విద్యుత్ లైన్‌పై ఉడుత పడిన కారణంగానే విద్యుత్ తీగ తెగిపోయిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments