కడప జిల్లాలో క్షణాల్లో 4 అంతస్తుల భవనం కూల్చివేత

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (17:51 IST)
కడప జిల్లాలో నాలుగు అంతస్తుల భవనం ఒకటి పేకమేడలా కూలిపోయింది. అండర్ గ్రౌండ్ బిల్డింగ్ నిర్మించేందుకు పక్కింటి వ్యక్తి పునాదులు తవ్వడంతో ఆ నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్టుండి పక్కకు ఒరిగిపోయింది. దీంతో స్థానికులు ఖంగుతిన్నారు. 
 
ఈ ఘటన జిల్లాలోని రైల్వే కోడూరు అయ్యప్ప ఆలయం ఎదురుగా జరిగింద. ఈ ప్రాంతానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఇటీవల రూ.60 లక్షల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో ఒక భవనాన్ని నిర్మించుకున్నాడు. అయితే, అదే ఇంటి పక్కన ఉన్న వెంకటరామరాజు అనే వ్యాపారి కూడా అండర్ గ్రౌండ్ భవనం నిర్మించడానికి 15 అడుగులు మేరకు పునాదులు తీశాడు. 
 
దీంతో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం ఏర్పడలేదు. దీంతో కుంగిపోయిన ఇంటితోపాటు.. స్థలాన్ని కూడా వెంకటరామరాజు కోటి రూపాయలు కొనుగోలు చేసి బాధితుడికి న్యాయం చేశాడు. ఆ తర్వాత ఆ భవాన్ని క్షణాల్లో కూల్చివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments