Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం కోసం అరటి గెలలు కోయబోతే విద్యుత్ షాక్... నలుగురు దుర్మరణం..

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (17:31 IST)
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. నిశ్చితార్థం వేడుక కోసం ఆరటి గెలలు తేవడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మండలంలోని పాతరౌతుపేటకు చెందిన కొమ్మ వెంకన్న (49) తన కుమారుడు శ్రీనుకు ఈ నెల 6వ తేదీన నిశ్చితార్థం చేయాలని నిర్ణయించాడు. 
 
ఇందుకోసం అరటి గెలలు తేవడానికి ఆదివారం ఉదయం కొత్తరౌతుపేటలో ఉంటున్న తన బావమరిది ఆబోతుల రాములు (57)కు చెందిన అరటితోటకు బావ, బావమరిదిలు ఇద్దరూ కలిసి వెళ్లారు. అక్కడ చెట్లకు హెచ్‌టీ విద్యుత్‌ తీగలు తగులుతున్నాయని గమనించని వెంకన్న, రాములు గెలలను కోయబోయారు. 
 
విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయారు. ఉదయం వెళ్లిన మనుషులు ఎంతకూ రాకపోవడంతో ఆందోళన చెందిన రాములు భార్య పుణ్యవతి (53), వెంకన్నకు సోదరి వరుస అయ్యే రౌతు బంగారమ్మ (52) తోటకు వెళ్లారు. విగత జీవులుగా పడి ఉన్నవారిని పట్టుకోవడంతో వారికి కూడా విద్యుత్ షాక్ తగిలి మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments