లాక్ డౌన్ శాపం.. 4నెలల పసికందుకు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 26 మే 2020 (16:55 IST)
కరోనా మహమ్మారి పేదల పాలిట శాపంగా మారింది. పొట్ట కూటి కోసం పక్క రాష్ట్రాలకు వలస పోయిన కార్మికులు లాక్ డౌన్‌తో నానా తంటాలు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు పనులు లేక స్వస్థలాలకు తరలివస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నారాయణ పేట జిల్లాలో నాలుగు నెలల పసికందుకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. 
 
రెండు రోజుల క్రితం ముంబై నుంచి జాక్లైర్‌కు వచ్చిన వలస కూలీ, అతని కుమారుడికి పరీక్షలు నిర్వహించగా బాలునికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యం కోసం వారిని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు.
 
మరోవైపు నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల క్రితం ముంబై నుంచి వలస వచ్చిన 60 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో అతనిని మూడు రోజుల క్రితం జిల్లా దవాఖానకు తరలించారు. 
 
అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించగా మంగళవారం అతనికి పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు. ఇతనితో పాటు ముంబై నుంచి మరో ఐదుగురు ఒకే కారులో ప్రయాణం చేసి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. వారికి కూడా పరీక్షలు జరిపి పాజిటివ్ రాకుంటే హోం క్వారంటైన్ లో ఉంచుతామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments