Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో కోవిడ్‌ పాజిటివ్‌.. మూడుకు చేరిన కేసులు

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (19:22 IST)
ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో పట్టణంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. ఒంగోలులోని లంబాడి డొంకకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చినట్లు జిజిహెచ్ ఒంగోలు సూపరింటెండెంట్ డాక్టర్ ఎం భగవాన్ నాయక్, సిఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ బి తిరుమలరావు తెలిపారు. 
 
RT-PCR పరీక్ష కోసం ఆదివారం అతని నమూనాను సేకరించారు. సోమవారం ల్యాబ్ ద్వారా ప్రకటించడం జరిగింది. కరోనా సోకిన వ్యక్తిని ఆసుపత్రిలోని కోవిడ్ స్పెషల్ వార్డుకు తరలించి, అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 
 
మార్కెట్లు, సినిమా హాళ్లు లేదా ప్రయాణాలు వంటి రద్దీ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని వైద్యులు ప్రజలను హెచ్చరించారు. ఇది పండుగ సీజన్ కాబట్టి, ప్రజలు మార్గదర్శకాలను పాటించాలని.. తమ కుటుంబాన్ని కోవిడ్ నుండి రక్షించుకోవాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments