Webdunia - Bharat's app for daily news and videos

Install App

36 మంది న్యాయమూర్తుల బదిలీ...గుంటూరుకు ర‌వీంద్ర‌బాబు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (11:05 IST)
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఏ.వి. రవీంద్రబాబును నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రవీంద్ర బాబు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తూ, ఇక్కడకు బదిలీపై రానున్నారు. ఈ బదిలీల్లో గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అయిదు జిల్లాస్థాయి కోర్టులకు న్యాయమూర్తులు నియమితులయ్యారు. 
 
చిత్తూరు జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఆర్.శ్రీలతను పదోన్నతి పై గుంటూరు ఐదవ అదనపు జిల్లా మహిళా కోర్ట్ న్యాయమూర్తిగా నియమించారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఒకటవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి విచారిస్తున్న ఫోక్సో కేసులు కూడా ఆమె విచారించేలా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. 
 
గుంటూరు మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా విశాఖపట్నం జువైనల్ కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జి.అర్చనను నియమించారు. గుంటూరు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా చిత్తూరులో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న పివీఎస్. సూర్యనారాయణ మూర్తిని నియమించారు. కర్నూలు జిల్లా ఆదోని సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎ.సోమశేఖర్ ను గురజాల అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతిపై నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments