Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు డ్రైవర్లు కాదు... తాగుబోతులు : మద్యం మత్తులో ప్రైవేట్ బస్సు డ్రైవర్లు

Webdunia
బుధవారం, 15 మే 2019 (12:20 IST)
విజయవాడ నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు సంస్థలకు చెందిన ప్రైవేట్ బస్సులను ఆపి వాటిని నడుపుతున్న డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలువురు డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడుపుతున్నట్టుగా గుర్తించారు. 
 
సోమవారం రాత్రి విజయవాడ సమీపంలోని కంచికచర్ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా, పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ప్రయాణికుల ప్రాణాలను ఫణంగా పెడుతూ, బస్సును నడుపుతూనే మద్యం తాగుతున్నారనడానికి ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. 
 
ఈ పోలీసుల తనిఖీల్లో వెంకట పద్మావతి, జీవీఆర్‌, కనకదుర్గ ట్రావెల్స్‌ డ్రైవర్లు తనిఖీల్లో పట్టుబడగా, వారందరిపై కేసులను నమోదు చేశారు. ఆ తర్వాత వీరిని బస్సులు నడిపేందుకు పోలీసులు అనుమతించలేదు. ఆ సమయంలో బస్సులో మరో డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు రాత్రిపూట నడిరోడ్డుపై పడిగాపులు కాయాల్సి వచ్చింది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments