Webdunia - Bharat's app for daily news and videos

Install App

3.30 గంటల్లో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ!

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:00 IST)
కాజీపేట-విజయవాడ మధ్య సీవోసీఆర్‌ (కన్‌ఫర్మేటరీ ఆస్కిలోగ్రాఫ్‌ కార్‌ రన్‌) రైలు పరుగు విజయవంతమైంది. 135 కి.మీ. గరిష్ఠ వేగంతో 24 బోగీలతో ఉదయం 10:30 గంటలకు కాజీపేటలో ప్రారంభమైన రైలు మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడ చేరుకుంది.

ప్రస్తుతం కాజీపేట నుంచి విజయవాడకు 3-3.5 గంటలు పడుతోంది. రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110 కి.మీ. రాజధాని రైళ్ల వేగం మాత్రం 120 కి.మీ. తాజా పరీక్ష నేపథ్యంలో గంటకు 135 కి.మీ. గరిష్ఠ వేగంతో రైలు వెళితే సికింద్రాబాద్‌ నుంచి కాజీపేటకు గంటన్నరలో చేరుకోవచ్చు.

కాజీపేట నుంచి విజయవాడకు 2 గంటల్లో వెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు. కొన్ని అవరోధాలు తొలగిస్తే సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు 3.30 గంటల్లో చేరుకోవచ్చు.

ఇప్పుడు దాదాపు ఐదున్నర గంటల సమయం పడుతోంది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు రెండు మార్గాలున్నాయి.

ఒకటి కాజీపేట, వరంగల్‌ మీదుగా.. రెండోది నడికుడి మీదుగా. ప్రస్తుతం సికింద్రాబాద్‌ - కాజీపేట - విజయవాడ మార్గం (350 కిలోమీటర్లు)లో రైల్వే ట్రాక్‌ సామర్థ్య పరీక్షలు పూర్తయ్యాయి.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments