Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్‌తో కలిసి బ్రేక్ ఫాస్ట్‌కు వెళుతుండగా ప్రమాదం.. గోవాలో నెల్లూరు యువతి మృతి

ఠాగూర్
మంగళవారం, 12 మార్చి 2024 (15:31 IST)
గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. తన స్నేహితుడితో కలిసి అల్పాహారం చేసేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న స్కూటీ అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరి కిందపడింది. ఆ సమయంలో వెనుకనే వస్తున్న కారు ఆమెపైకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మంగళవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువతి పూజిత దుర్మరణం చెందింది. స్నేహితుడితో కలిసి లంచ్ చేసేందుకు హోటల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పూజిత ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస వదలగా.. ఆమె స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
గోవాలని అంజునా పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరుకు చెందిన పూజిత, హర్యానాకు చెందిన శివం ఉప్లాక్ష్ స్నేహితులు.. ఇద్దరూ గోవా ట్రిప్ కోసం వచ్చారు. స్థానికంగా బైక్స్ రెంట్‌కు ఇచ్చే ఓ షాప్‌లో స్కూటీని అద్దెకు తీసుకున్నారు. సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు అంజునాలోని ఓ రెస్టారెంట్‌కు బయలుదేరారు. స్కూటీని శివం నడుపుతుండగా పూజిత వెనుక కూర్చుంది. 
 
స్టార్ కో జంక్షన్‌లో స్కూటీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది. దీంతో వెనుక కూర్చున్న పూజిత ఎగిరి రోడ్డుపై పడిపోయింది. వెనుకే వేగంగా వస్తున్న కారు ఆమెపై దూసుకెళ్లింది. అయినా డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు పోనివ్వడంతో పూజిత శరీరం నలిగిపోయింది. దాదాపు వంద మీటర్ల వరకు కారు ఆమెను ఈడ్చుకెళ్లింది. శివం కూడా గాయాలపాలయ్యాడు. 
 
స్థానికులు వారిద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పూజిత అప్పటికే చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. శివంను ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, పూజిత డెడ్ బాడీని బంబోలిమ్‌లోని మెడికల్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, పోస్టుమార్టం చేశాక ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అంజునా పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ సమ్రీన్ భవానీని అదుపులోకి తీసుకుని ప్రమాదం జరిగిన తీరుపై విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments