Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సుల్లో చార్జీల తగ్గింపు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (14:43 IST)
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలను 20 శాతం మేరకు తగ్గించారు. ముఖ్యంగా, కృష్ణా జిల్లా హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే బస్సులో ఈ ప్రయాణ చార్జీల తగ్గింపు అమలుకురానుంది. కృష్ణా జిల్లాకు చెందిన అన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో 20 శాతం మేరకు బస్సు చార్జీలను తగ్గించాలని నిర్ణయించింది. 
 
ముఖ్యంగా, ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ వంటి బస్సుల్లో తగ్గింపు చార్జీలు వర్తిస్తాయి. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ తగ్గింపు చార్జీలు వర్తిస్తాయి. అలాగే, హైదరాబాద్ నుంచి కృష్ణ జిల్లాకు వచ్చేవారికి మాత్రం శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో  ఈ తగ్గింపు ఉంటుంది. 
 
కాగా, ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ కూడా ప్రయాణికులను ఆకర్షించేందుకు పలు రకాలైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా, ప్రయాణికుల ముంగిటకే ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉండేలా చర్యలు తీసుకున్న విషయం తెల్సిందే. సంక్రాంతి కోసం నడిపిన ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు లేకుండా నడిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments