Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవంతో నడిరోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు.. హైవేపై ట్రాఫిక్ జామ్

Webdunia
సోమవారం, 19 జులై 2021 (16:10 IST)
తెలంగాణలోని యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్ వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఓ గ్రామానికి చెందిన ప్రజలు శవంతో నడి రోడ్డుపై బైఠాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీరి ఆందోళన కారణంగా దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించి పోయింది. 
 
దండు మల్కాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు కరోనా టీకా వేయించుకోవడానికి వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు రహదారిపై ఆందోళనకు దిగారు.
 
మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి రాస్తారోకో నిర్వహించారు. అండర్ పాస్ బ్రిడ్జి లేని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు మండిపడ్డారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 
 
ప్రమాద స్థలి వద్దకు వచ్చిన ఏసీపీ శంకర్ ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం గ్రామస్థులు ఆందోళనను విరమించారు. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాలు కదిలాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments