Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. డెంగ్యూ జ్వరంతో మృతి

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (11:34 IST)
డెంగ్యూ జ్వరంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లాలో ఈ విషాధం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం పంచాయతీ టీవీఎన్‌ఆర్‌పురంకి చెందిన కృష్ణం రాజు, రెడ్డమ్మల కుమార్తె చంద్రకళ (18)కు ఇటీవలే పెళ్లి కుదిరింది.  అక్టోబర్ 30న పెళ్లి చేసేందుకు వధువు, వరుడు తరుపు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 
 
అయితే చంద్రకళకు డెంగ్యూ సోకడంతో తమిళనాడులోని షోళింగర్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పెళ్లిరోజు వరకు ఆమె కోలుకోకపోవడంతో పెళ్లిని కూడా వాయిదా వేశారు. బుధవారం వధువు, వరుడి తరపు వారు ఆస్పత్రికి చేరుకుని.. తొలుత వివాహం జరిపించాలని పట్టుబట్టారు. 
 
కానీ వైద్యులు అందుకు నిరాకరించడంతో ఆస్పత్రి నుంచి వెనుదిరిగారు. శుక్రవారం రాత్రి చంద్రకళ మృతి చెందడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. చంద్రకళ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments