Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమడోలులో వింత వ్యాధి ... ఉన్నట్టుండి పడిపోతున్న ప్రజలు

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో ఓ వింత వ్యాధి వెలుగు చూసింది. ఈ ప్రాంత వాసులు ఉన్నట్టుండి ఠపీమని కిందపడిపోతున్నారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఈ మండలంలోని పూళ్ల గ్రామంలో కొంతమంది ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. అలా మొత్తం 16 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కొందరిలో మూర్ఛ లక్షణాలు కూడా కనిపించడంతో ఏలూరు ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. 
 
బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆహారం విషతుల్యం కావడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
 
కాగా, ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోనూ ఇలానే జరిగింది. స్థానికులు కొందరు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. సమీపంలోని రసాయన పరిశ్రమ అర్ధరాత్రి విడిచిపెట్టే వ్యర్థాల వల్లే ఇలా జరిగిందని తేలింది. 
 
అలాగే, తెలంగాణలోని మహబూబాబాద్ మండలం అయోధ్య శివారు భజనతండాలోనూ ఇలాంటి వింత వ్యాధి కొన్ని రోజులపాటు స్థానికులను వణికించింది. వాంతులు, విరేచనాలతో 130 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments