Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోపాక్ సరిహద్దులను తలపిస్తున్న "ఏపీ సీఎంవో" పరిసరాలు

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (08:22 IST)
సాధారణగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివుంటాయి. దీంతో ఇరు దేశాలు సరిహద్దుల్లో ఇనుప ముళ్ళ కంచెలు వేసివుంటారు. కానీ, ఇపుడు ఇదే దృశ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కార్యాలయమైన సీఎంవో వద్ద కనిపిస్తున్నాయి. 
 
సీఎంవో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు దాని చుట్టూత ముళ్ల కంచెను వేశారు. దీనికి కారణం లేకపోలేదు. సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయల సంఘాలు ఛలో సీఎంవో (పోరు గర్జన)కు సోమవారం పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు విజయవాడ వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అలాగే పోలీసు యాక్ట్ 30ని కూడా అమలు చేస్తున్నారు.
 
పైగా, పోలీస్ ఆంక్షలను కాదని ఎవరైనా ఛలో సీఎంవోకు వస్తే మాత్రం క్రిమినల్ కేసులు బనాయిస్తామని హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ చేరుకోకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల దగ్గర అడ్డుకుంటున్నారు. యూటీఎఫ్ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. ఛలో సీఎంవో దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్, సీఎంవో ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని సుమారుగా 800 మందికిపై పోలీసుల బలగాలను మొహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments