Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోపాక్ సరిహద్దులను తలపిస్తున్న "ఏపీ సీఎంవో" పరిసరాలు

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (08:22 IST)
సాధారణగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివుంటాయి. దీంతో ఇరు దేశాలు సరిహద్దుల్లో ఇనుప ముళ్ళ కంచెలు వేసివుంటారు. కానీ, ఇపుడు ఇదే దృశ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కార్యాలయమైన సీఎంవో వద్ద కనిపిస్తున్నాయి. 
 
సీఎంవో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు దాని చుట్టూత ముళ్ల కంచెను వేశారు. దీనికి కారణం లేకపోలేదు. సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయల సంఘాలు ఛలో సీఎంవో (పోరు గర్జన)కు సోమవారం పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు విజయవాడ వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అలాగే పోలీసు యాక్ట్ 30ని కూడా అమలు చేస్తున్నారు.
 
పైగా, పోలీస్ ఆంక్షలను కాదని ఎవరైనా ఛలో సీఎంవోకు వస్తే మాత్రం క్రిమినల్ కేసులు బనాయిస్తామని హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ చేరుకోకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల దగ్గర అడ్డుకుంటున్నారు. యూటీఎఫ్ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. ఛలో సీఎంవో దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్, సీఎంవో ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని సుమారుగా 800 మందికిపై పోలీసుల బలగాలను మొహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments