Webdunia - Bharat's app for daily news and videos

Install App

శానిటైజర్ తాగి 14మంది ఆత్మహత్య.. పది మందికి కరోనా

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (13:05 IST)
శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన పదిమందికి కరోనా పాజిటివ్ వున్నట్లు తేలింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనలో డెడ్ బాడీలకు పోస్టుమార్టం కోసం హెల్త్ సెంటర్​కు తరలించారు. అక్కడ మృతదేహాలకు కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా మృతుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. 
 
ప్రకాశం జిల్లాలో మద్యం దొరక్కపోవడంతో శానిటైజర్ తాగి 14మంది మృతి చెందారు. కురిచేడులో 10 మంది చనిపోగా.. పామూరులో ముగ్గురు మరణించారు. కాగా, ఈ ఘటనపై ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలు సీరియస్ అయిన విషయం తెలిసిందే.
 
కాగా మద్యానికి బానిసైన వ్యక్తులు మద్యనిషేధం, రేట్లు పెరగడం.. దానికి తోడు కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్‌ను మద్యంగా భావించి సేవించారు. దీంతో ఈ ఘటన పెద్ద సంచలనమైంది. ఘటనపై సీఎంఓ ఆరా తీసింది. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments