Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో దారుణం: 13 ఏళ్ల బాలికను ఆ రొంపి దింపి..?

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (13:43 IST)
గుంటూరు జిల్లాలో బాలికపై దారుణం చోటుచేసుకుంది. 13ఏళ్ల బాలికను బలవంతంగా వ్యభిచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పల్నాడులో భార్య, 13 ఏళ్ల కూతురికి 7 నెలల కిందట కరోనా సోకింది. 
 
వారిని బాలిక తండ్రి జీజీహెచ్‌లో చేర్చించగా.. భార్య చికిత్స పొందుతూ చనిపోయింది. అదే సమయంలో బాలికకు తండ్రి తప్ప ఎవరూ లేరని తెలుసుకున్న స్వర్ణభారతినగర్‌కు చెందిన ఓ మహిళ.. తాను ఓ నర్సునని బాలిక తండ్రిని నమ్మించింది.
 
బాలికకు నాటు వైద్యం చేస్తే.. కరనా తగ్గిపోతుందని నమ్మించి.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లింది. కొద్ది రోజుల తర్వాత వ్యభిచారం చేయాలని ఒత్తిడికి గురి చేసింది. ఇష్టం లేదని చెప్పినా.. కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉంచుకుని ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. నెల్లూరు, విజయవాడ, ఒంగోలుకు తీసుకెళ్లి బాలికతో వ్యభిచారం చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణ తెలిసింది.
 
కాగా కొన్ని రోజుల కింద బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాలికను నిర్వహకురాలు విజయవాడలో వదిలేసిందని, ఆ తర్వాత బాలిక తన ఇంటికి చేరిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments