Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిలో 11వరోజు రైతుల దీక్ష.. దేవినేని సంఘీభావం

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (18:03 IST)
రాజధాని గ్రామాల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలకు మద్దతుగా శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు తుళ్లూరు గ్రామంలోని రైతుల దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్,  శ్రావణ్ లతో కలిసి సందర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు.
 
ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ మీ త్యాగంతో మీరిచ్చిన భూములలో కట్టిన సచివాలయానికి ముఖ్యమంత్రి జగన్ అసాధారణ పోలీసు భద్రత మధ్య ముళ్ళ కంచెలు వేసుకొని డమ్మీ కాన్వాయ్ ఉపయోగించి రావడం సిగ్గుచేటని దేవినేని విమర్శించారు.
 
రాజధాని కోసం 11రోజులుగా మీరు చేస్తున్న పోరాటం దేశం మొత్తం చూస్తోందని రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని కదిలించిందని అన్నారు.
 
మీకు మద్దతుగా పోరాటం చేస్తున్నందుకు అరెస్టులు చేసి ఇప్పటికే నాపై నాలుగు కేసులు నమోదు చేశారని మీ కేసులకు అరెస్టులకు భయపడేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 
ఈ నెల 3వ తేదీన బీసీజి కమిటీ రిపోర్టు  వస్తుందని 4వ తేదీ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని 18వ తేదీన మీరిచ్చిన భూములలో కట్టిన శాసనసభలో ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తున్నారని దేవినేని అన్నారు.
 
రాజధాని నిలుపుకోవాలని మీరు చేస్తున్న పోరాటాల ముందు, మీ సంకల్ప బలం ముందు ఏ ముఠాల  లాబీయింగ్ లు పనిచేయవని రాజధాని తరలించే శక్తి ఎవరికీ లేదని అమరావతి రాజధానిగా కొనసాగుతుందని దేవినేని పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments