Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవుల మృతిపై పోస్ట్ మార్టం-రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (15:15 IST)
ఆవుల మృతిపై పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం ప్రిలిమినరీ నివేధిక ప్రకారం టాక్సిసిటి (విషప్రయోగం) అని తేలింది. గడ్డి మినహా ఎలాంటి ఆహారం పొట్టలో లేవని పశు వైద్యులు నిర్ధారించారు. టాక్సిసిటీ కారణంగా శరీరం లోపల అవయవాలపై రక్తపు చారలు, ఊపిరితిత్తులు, గుండెపై అక్కడక్కడా రక్తపు చారలు వున్నాయని వైద్యులు తెలిపారు.


ఊపిరితిత్తుల్లోకి చేరిన నీరు టాక్సిసిటీ కారణంగానే ముక్కు లోంచి రక్తం బయటికి వచ్చిందని..ఇందుకు బ్లోటింగ్ (పొట్ట ఉబ్బరం) కాదని వైద్యులు తేల్చారు. పోస్ట్ మార్టం సమయంలో ఆవుల కడుపులో గడ్డి తప్ప ఇతర పదార్థాలేవీ లేవని చెప్పారు.

తాడేపల్లి గోశాలలో వంద గోవులు చనిపోవడం బాధాకరమని రాజాసింగ్, బీజేపీ నేత అన్నారు. వంద ముగజీవాలు చనిపోయినా అక్కడి ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. 
 
ముగజీవాల మృతిపై విచారణ జరిపి ఏం జరిగిందో ప్రజలకు వివారించాలని తెలిపారు. దురుద్దేశ్యలతోనే కొందరు కావాలని ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది
ఈ రోజు లేదా రేపు తాడేపల్లి గోశాలకు వెళ్లి నిజాలను తెలుసుకుంటానని చెప్పారు. గోవుల మృతికి కారణమైన వారిని
 కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments