Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుల రద్దీ.. 10 ప్రత్యేక రైళ్ళు పొడగింపు

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (11:41 IST)
రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను ఈ నెల ఆఖరివారం వరకు పొడగించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇలా పొడగించిన రైళ్లలో పది ఉన్నాయి. వాటి వివరాలను ఓసారి పరిశీలిస్తే, సికింద్రాబాద్ - తిరుపతి రైలును డిసెంబరు 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పొడగించారు. ఈ రైలు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్ రైలు ఈ నెల 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
 
ఇకపోతే, హైదరాబాద్ - నర్సాపూర్ రైలు డిసెంబరు 2 నుంచి 30వ తేదీ వరకు, నర్సాపూర్ - హైదరాబాద్ రైలు డిసెంబరు 3 నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. కాకినాడ - లింగంపల్లి రైలు డిసెంబరు 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటాయి. లింగంపల్లి - కాకినాడ రైలు డిసెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లోనూ, తిరుపతి - అకోలా, పూర్ణ - తిరుపతి మధ్య నడిచే రైళ్ళను కూడా ఇరు మార్గాల్లో నెలాఖరు వరకు పొడగించినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments