Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో ఘోరం.. 45మంది గల్లంతు.. కిటికీలు మూతపెట్టడంతో మునిగిపోయిందా?

గోదావరిలో ఘోరం జరిగిపోయింది. గాలివాన దెబ్బకు లాంచీ నీట మునిగింది. దీంతో 30 అడుగుల లోతుకు మునిగిపోయింది. గాలివాన దెబ్బకు నీటి అలజడి, గాలి తాకిడికి లాంచీ అదుపు తప్పడంతో నీట మునిగింది. లాంచ్‌ను ప్రారంభిం

Webdunia
బుధవారం, 16 మే 2018 (14:22 IST)
గోదావరిలో ఘోరం జరిగిపోయింది. గాలివాన దెబ్బకు లాంచీ నీట మునిగింది. దీంతో 30 అడుగుల లోతుకు మునిగిపోయింది. గాలివాన దెబ్బకు నీటి అలజడి, గాలి తాకిడికి లాంచీ అదుపు తప్పడంతో నీట మునిగింది. లాంచ్‌ను ప్రారంభించవద్దన్నా వినకుండా సరంగు బయల్దేరడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 
 
వర్షం ధాటికి లాంచీ తలుపులు, కిటికీలు మూతపడటంతో.. లాంచీలోనే మిగిలిన వారంతా వుండిపోయారు. గల్లంతైన వారిపై భిన్న కథనాలు వస్తున్నాయి. ఇక అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలవరం నుంచి రెండు భారీ క్రేన్లను తరలించారు. ఫ్లడ్‌ లైట్లు, పడవలతో గాలింపు చర్యలు జరుగుతున్నాయి.  
 
గల్లంతైన వారంతా కష్టజీవులు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలానికి చెందిన గ్రామాలకు చెందిన వారు. కిరాణా సరుకులు, ఇతర అవసరాల కోసం మంగళవారం మండల కేంద్రమైన దేవీపట్నం వెళ్లారు. పనులన్నీ పూర్తయ్యాక తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. లక్ష్మీ వేంకటేశ్వర లాంచీ... దేవీపట్నం నుంచి కొండమొదలుకు నాలుగు గంటల సమయంలో పయనమైంది. అది 40 మంది సామర్థ్యమున్న లాంచీ. కానీ 60మంది లాంచీ కదిలింది. పెనుగాలులు వీస్తున్నాయని చెప్తున్నా సరంగు పట్టించుకోలేదు. 
 
ఈడ్చికొడుతున్న గాలిదెబ్బకు వాన చినుకులు లాంచీ కిటికీల్లోంచి లోపల పడుతున్నాయి. దీంతో కిటికీలు, తలుపులు మూసేశారు. కిటికీలన్నీ మూసేయడంతో పెనుగాలి ఒక్కసారిగా తోయడం, లోపలున్న వాళ్లంతా ఆందోళనతో ఒకేవైపునకు రావడం వల్ల లాంచీ పక్కకు ఒరిగిపోయింది. నిమిషాల్లోనే గోదావరిలో మునిగిపోయింది. గోదావరి తీరంలో మంటూరు-వాడపల్లి వద్ద ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
 
కాగా, పశ్చిమగోదావరి జిల్లాలోని గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీని సహయకబృందాలు బుధవారం మధ్యాహ్నం వెలికి తీశారు. లాంచీలోనే చిక్కుకుపోయిన మృతదేహలను వెలికితీస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. బాధితులను ఓదార్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments