Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల విచిత్రం.. నేనుండగా నా భర్తకు ఎలా టిక్కెట్ ఇస్తారు.. భర్తపై రెబల్ అభ్యర్థిగా భార్య పోటీ... ఎక్కడ?

వరుణ్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (08:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాలో పలు నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద ఎక్కువైంది. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఆయన భార్య వాణి పక్కలో బల్లెంలా తయారయ్యారు. తన భర్తపై తాను పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు. మరోవైపు, ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ 19వ తేదీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. 
 
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఇపుడు అధికార వైకాపా రాజకీయ విచిత్రంగా మారింది. దీనికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి చేసిన సంచలన ప్రకటనే. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె ప్రకటించడంతో వైకాపా నేతలు, శ్రేణులు ఖంగుతిన్నాయి. ప్రస్తుతం ఆమె జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. గురువారం ఆమె జన్మదినం కావడంతో కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆమె వారితో మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన టెక్కలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించడంతో వారంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. 
 
నిజానికి దువ్వాడ శ్రీనివాస్ దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందని ఆమె సీఎం జగన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వాణి టెక్కలి నియోజకవర్గం నుంచి ఇన్‌చార్జిగా వైకాపా నియమించింది. అయితే, ఆమె భర్త శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆగ్రహించిన ఆమె... స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments