Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిస్టరీలో ఫస్ట్ టైమ్ :: 151 సీట్లు వచ్చినోడ్ని ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి బిత్తరపోయేలా చేస్తున్నారు..!!

ఠాగూర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (14:32 IST)
చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకోనుంది. గత ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని, ఐదేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి, కనీసం ఒక్క చోటు కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి ఇపుడు బిత్తరపోయేలా చేస్తున్నాడు. ఆ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కాగా, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఎలాగైనా ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో అధికార వైకాపా నేతలతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు ఉన్నారు. ఇందుకోసం ఇంతకాలం కాపు కులానికి పెద్దగా ఉన్న ముద్రగడ పద్మనాభంను వైకాపాలోకి చేర్చుకున్నారు. ఈయన ద్వారా కాపు ఓట్లను గుంపగుత్తంగా వైకాపాకు పడేలా చూసుకుని పవన్‌ను ఓడించాలని వ్యూహం రచించాడు. అది వర్కౌట్ కాలేదు. దీంతో రూ.500 కోట్లు ఓటర్లకు పంచి ఓడించేందుకు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. 
 
అయితే, పవన్ కళ్యాణ్ పట్ల పిఠాపురం ప్రజలకు ఉన్న అభిమానాన్ని డబ్బుతో కొనుగోలు చేయలేమని కోడి కూయకముందే అర్థమైంది. ఆ తర్వాత మండలానికో మంత్రిని, గ్రామానికో ఓ ఎమ్మెల్యేను ఇన్‌చార్జ్‌లు నియమించారు. కానీ క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేకపోయారు. దీంతో ఇపుడు డమ్మీ ఈవీఎంలను వైకాపా నేతలు నమ్ముకున్నారు. జగన్ స్టిక్కర్లు, ఇతర సామాగ్రి, డమ్మీ ఈవీఎంలను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు గుర్తించి, అందులోని ఈవీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments