19న మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నామినేషన్...

వరుణ్
గురువారం, 18 ఏప్రియల్ 2024 (12:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికలతో పాటు లోక్‌సభ స్థానాలకు కూడా ఎన్నికలు మె 13వ తేదీన నిర్వహిస్తారు. అయితే, ఎన్డీయే కూటమి తరపున కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుుడు ఈ నెల 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరపున తొలిసారిగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు.
 
శుక్రవారం ఉదయం కుప్పం వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. ఆ తర్వాత తన భర్త చంద్రబాబు తరపున ఆమె కుప్పంలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఆ తర్వాత శనివారం కుప్పం ప్రజల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె కుప్పం నుంచి బెంగుళూరుకు చేరుకుని అక్కడ నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. 
 
అదేవిధంగా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీడీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారు. మధ్యాహ్నం 2.34 గంటలకు లోకేశ్ తరపున బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ఉదయం సర్వమత ప్రార్థనలతో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ నేతలు ర్యాలీలు చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments