Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూతలపట్టు వైకాపా అసెంబ్లీ అభ్యర్థిని చితకబాదిన గ్రామస్థులు

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (16:02 IST)
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎస్ బాబును ఓటర్లు చితకబాదారు. ఈ సెగ్మెంట్‌లో అధికార టీడీపీకి బలమైన పట్టుంది. అయితే ఈ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా ఎంఎస్ బాబు పోటీ చేస్తున్నారు. ఈయన గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత పోలింగ్ సరళిని తనిఖీ చేసేందుకు తన అనుచరులతో కలిసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. 
 
ఈ క్రమంలో ఐరాల మండలంలోని కట్టకిందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఆ పోలింగ్ కేంద్రంలో ఓట్లన్నీ సైకిల్ గుర్తుకు పడుతున్నాయని గ్రహించిన ఆయన ఆగ్రహంతో రగిలిపోయి... ఈవీఎంలతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తిరగబడిన గ్రామస్థలు.. ఎమ్మెల్యే అభ్యర్థి బాబును పట్టుకుని చితకబాదారు. అంతేకాకుండా, ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబును ఐరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తొలుత తరలించి, అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఇదే మండలంలోని రెడ్డివారిపల్లిలో కూడా టీడీపీ - వైకాపా కార్యకర్తలు, ఏజెంట్ల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. చిత్తూరు జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క పూతలపట్టు సెగ్మెంట్‌లోనే ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments