Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో తుడిసిపెట్టుకున్న తెలుగుదేశం.. లోక్‌సభ ఎన్నికల పోటీకి దూరం

Webdunia
ఆదివారం, 24 మార్చి 2019 (12:39 IST)
తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తుడిసిపెట్టుకుని పోతుందని చెప్పొచ్చు. వచ్చే నెల 11వ తేదీన జరుగనున్న లోక్స‌సభ ఎన్నికలకు ఆ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా... ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
 
కాగా, గత యేడాది డిసెంబరు నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయినప్పటికీ తెరాస విజయభేరీని అడ్డుకోలేక పోయాయి. పైగా, ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారు కూడా అధికార తెరాసలో చేరిపోయారు. దీంతో తెలంగాణ శాసనసభలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇపుడు లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించడంతో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments