Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన గుర్తు మారిందా? సోషల్ మీడియాలో వైరల్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (16:08 IST)
హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నిల సంఘం గ్లాజు గాజు గుర్తును కేటాయించింది. ఈ గుర్తుకు ఓటేయాలంటూ ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన గుర్తు మారిదంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ఓ ప్రచారం సాగుతోంది. గాజు గ్లాసు గుర్తుకు బదులుగా బ్లేడు గుర్తును కేటాయించారనే ప్రచారం సాగుతోంది. ఇది నిజమా అన్నట్లు చేసిన క్రియేవిటీ అందర్నీ డైలమాలో పడేసింది.
 
ఇందుకోసం జనసేన పార్టీ అధికారిక లెటర్ హెడ్ కాపీని డూప్లికేట్ చేశారు. ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి అయిన పి.హరిప్రసాద్ పేరుతో ఈ విధంగా రాశారు. గాజు గ్లాసు గుర్తుపై కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం మనకు తాత్కాలికంగా బ్లేడు గుర్తును కేటాయించడం జరిగింది. కావును బ్లేడు గుర్తును విరివిగా ప్రచారం చేయమని మనవి. బ్లేడు గుర్తుకే మన ఓటు. ఇట్లు పి.హరిప్రసాద్ పేరుతో పాటు అతని సంతకంతో ఈ లేఖ విడుదల అయినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లెటర్ హెడ్‌లోనే బ్లేడు గుర్తుకే మన ఓటు అని పెద్ద అక్షరాలతోపాటు బ్లేడు సింబల్ వేశారు. చాలా మంది ఈ వార్తపై కన్ఫ్యూజ్ అవుతున్నారు.
 
నిజమా అని బయట వ్యక్తులు.. మీడియా మిత్రులకు ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు అంటే.. ఎంతలా కన్ఫ్యూజ్ అయ్యారో ఈ వార్తతో అనేది స్పష్టం అవుతుంది. దీనిపై జనసేన పార్టీ స్పందించింది. తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. జనసేన కార్యకర్తలు ఎలాంటి గందరగోళానికి గురి కావొద్దని కోరారు. గుర్తు మారలేదని అధికారికంగా జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. లేఖ విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments