నా భర్త సత్తా నాకు తెలుసు.. అన్ని సీట్లు గ్యారంటీ: వై.ఎస్.భారతి

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (14:02 IST)
ఎన్నికలు సమీపించాయి. పోలింగ్‌కు మరో 4 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని కూడా జోరుగా సాగిస్తున్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తరపున విజయమ్మ, షర్మిళలు ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. జగన్ కూడా 13 జిల్లాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ తరపున ఆయన సతీమణి వై.ఎస్. భారతి అసలు ప్రచారం చేయలేదు. కానీ మొదటిసారి భర్త గెలుపు కోసం ఆమె ప్రచారం చేస్తున్నారు.
 
అది కూడా కడప జిల్లా పులివెందులలో. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్థి చేసుకోండి అంటూ వై.ఎస్. భారతి చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్‌ను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేస్తుండడంతో ఓటర్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వై.ఎస్. భారతి ప్రచారంలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తన భర్తకు సిఎంగా గెలిచే అవకాశం ఉందని, ఆయనలో ఆ సత్తా కూడా ఉందని, సర్వేల్లో 125 సీట్లకు పైగా వస్తాయని చెబుతున్నారని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వై.ఎస్. భారతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments